Breaking News

రూ.3 వేల కోట్ల మోసం కేసు.. హీరా గ్రూప్ చీఫ్ నౌహీరా షేక్ అరెస్ట్

మే 22, (నేటి తెలుగు పత్రిక): దాదాపు రూ.3 వేల కోట్ల ఆర్థిక మోసం కేసులో నౌహీరా షేక్ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 1.2 లక్షల మంది ఇన్వెస్టర్ల నుంచి భారీ మొత్తాలు సేకరించి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.కొద్ది వారాల క్రితం ఆమెపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ కాగా, అప్పటి నుంచి పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు కూడా నౌహీరా షేక్‌ను కోర్టుకు లొంగిపోవాలని ఆదేశించింది.హర్యానాలోని గురుగ్రామ్‌లో నకిలీ ఆధార్ కార్డు ఉపయోగిస్తూ తలదాచుకున్న ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలించనున్నట్లు సమాచారం.హీరా గ్రూప్ పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు వస్తాయని నమ్మించి వేలాది మందిని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలు ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *