Breaking News

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ గోల్డ్ మైన్స్ గుర్తింపు: మంత్రి కొల్లు రవీంద్ర

మే 22, (నేటి తెలుగు పత్రిక): అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో ప్రైవేట్ గోల్డ్ మైన్స్ గుర్తించబడ్డాయి అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.జియో మైసూర్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థ బంగారు శుద్ధి, ఉత్పత్తికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యంత్ర సామాగ్రి ఏర్పాటు చేసింది. ఒకటన్ను ముడి సరుకు నుంచి ఒక గ్రాము బంగారం తీసుకునే సామర్థ్యం ఉందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం 300 మీటర్ల లోతులో తవ్వకం జరుగుతున్నది, భవిష్యత్తులో రెండు కిలోమీటర్ల వరకు విస్తరించనున్నట్లు చెప్పారు.ఇది దేశంలోనే మొదటి ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు అని మంత్రి గుర్తు చేశారు. రామగిరి బీచ్ శాండ్‌లో ఖనిజ సంపదను గుర్తించడం కూడా జరిగింది.గ్రానైట్, క్వార్ట్జ్‌కు భారీ డిమాండ్ ఉందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మైనింగ్ లో దోపిడీ జరిగిందని, జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ పరిశ్రమను వచ్చే నెల 27న సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం చేయనున్నారని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ కూడా పాల్గొన్నారు.

మంత్రి నారా లోకేష్ చొరవతో ఎస్ఎల్ఎన్ కాలనీలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి పార్క్ అభివృద్ధి

పెద్దవాగు ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *