మే 22, (నేటి తెలుగు పత్రిక): జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల రెన్యువల్, కొత్త కార్డుల జారీ ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యంపై Telangana High Court తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రిడిటేషన్ కార్డుల సమస్యకు సంబంధించి విచారణ చేపట్టిన ధర్మాసనం.. కార్డుల పునరుద్ధరణ, కొత్త కార్డుల జారీ ఎందుకు ఆలస్యం అవుతోందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం ఎందుకని నిలదీసింది.ఈ సందర్భంగా ప్రభుత్వం స్పందిస్తూ గడువును జూన్ 16 వరకు పొడిగిస్తామని కోర్టుకు తెలిపింది. అయితే పదేపదే గడువు పెంచడం సరైన విధానం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వానికి సూచించిన ధర్మాసనం, తదుపరి విచారణను జూన్ 16కు వాయిదా వేసింది.
