మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో అరుదైన ఘనత సాధించింది. మొత్తం 2 వేల కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలో తొలి ప్రభుత్వ ఆస్పత్రిగా, దేశవ్యాప్తంగా మూడో ఆస్పత్రిగా రికార్డు నెలకొల్పింది.నిమ్స్లో 1989 సంవత్సరంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి వేలాది మంది కిడ్నీ బాధితులకు వైద్యసేవలు అందిస్తూ విశ్వసనీయ వైద్యసంస్థగా గుర్తింపు పొందింది.మొత్తం 2 వేల మంది రోగుల్లో సుమారు 1,900 మందికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఆధునిక వైద్యసాంకేతికతతో పాటు నిపుణులైన వైద్యబృందం కృషితో ఈ మైలురాయిని చేరుకున్నట్లు నిమ్స్ వర్గాలు తెలిపాయి.
