మే 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో విమానయాన సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలు ఉండగా, మరో పది ఎయిర్పోర్టులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ప్రతిపాదిత జాబితాలో నెల్లూరు జిల్లా దగదర్తి, చిత్తూరు జిల్లా కుప్పం, అమరావతి, శ్రీకాకుళం, పల్నాడు జిల్లా నాగార్జునసాగర్ ప్రాంతం, ప్రకాశం జిల్లా ఒంగోలు, అనంతపురం, తుని, కాకినాడ జిల్లా అన్నవరం ప్రాంతాలు ఉన్నాయి. మరో విమానాశ్రయాన్ని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే అంశంపై ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోంది.కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండటంతో అనుమతుల ప్రక్రియ మరింత వేగంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
