మే 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో త్వరలో 1,050 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని RTC అధికారులు తెలిపారు. పీఎం ఈ-బస్ సేవా పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ బస్సులను రాష్ట్రానికి కేటాయించినట్లు వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, రాజమహేంద్రవరం, కడప, అమరావతి, తిరుపతి, అనంతపురం వంటి ప్రధాన నగరాల్లో ఈ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.ఈ బస్సులను 12 డిపోలతో అనుసంధానం చేస్తూ అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
