Breaking News

జొన్న, మొక్కజొన్న రైతులకు శుభవార్త: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మే 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం జొన్న, మొక్కజొన్న రైతులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కొనుగోళ్ల కోసం భారీగా నిధులు కేటాయించింది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రూ.1,800 కోట్లు, జొన్న కొనుగోళ్ల కోసం రూ.1,100 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. మొక్కజొన్న కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా స్పందన రాకపోవడంతో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చిందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే మొక్కజొన్న సేకరణ కోసం రూ.4,000 కోట్లు విడుదల చేశామని, తాజా నిధులతో కలిపి మొత్తం రూ.5,800 కోట్లకు చేరిందన్నారు. ఈసారి భారీ దిగుబడులు రావడంతో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. రైతులు తమ పంటను సులభంగా విక్రయించుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.అలాగే పొద్దుతిరుగుడు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 25 శాతానికి మించి పంట కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని వెల్లడించా

మేడ్చల్‌లో టెర్రరిస్టులతో టచ్‌లో ఉన్న వ్యక్తి అరెస్ట్

ముందు ప్రజెంట్ సిటీని పట్టించుకో రేవంత్: కేటీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *