తెనాలి,మే23(నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): వేసవి కాలంలో విధ్యుత్ సమస్యలు రాకుండా అదికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రఆహార,పౌరసరాఫరాలశాఖ మంత్రినాదెండ్ల మనోహర్ అన్నారు.నియోజకవర్గంలోవిధ్యుత్ సమస్యలపైఅదికారులతో టెలికాన్ఫరేన్సునిర్వహించారు. కొల్లిపర మండలంలో మరోసారి విద్యుత్తు అంతరాయాలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.ట్రాన్సఫార్మర్ల లోపాలు తలెత్తితే వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని,అవసరమైతేమరిన్నిట్రాన్సఫార్మర్ల కోసంఉన్నతాధికారులతో మాట్లాడిసమస్యపరిష్కరిస్తానని హామీఇచ్చారు.తెనాలి పట్టణంలో 63 కెవీ ట్రాన్సఫార్మర్ల స్థానంలో 100 కెవీ అధిక సామర్థ్య ట్రాన్సఫార్మర్ల ఏర్పాటు వేగవంతంచేయాలని అదికారులనుఅదేశించారు.తెనాలి, సంగం జాగర్లమూడి, కట్టివరం ప్రాంతాల్లో అదిక లోడ్ ట్రాన్సఫార్మర్ల ఏర్పాటుకు ప్రాధాన్యంఇవ్వాలన్నారు.ప్రస్తుతం 30 ట్రాన్సఫార్మర్లు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే మరిన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారుకొత్తపేటలో రూ.10 కోట్లతో 8 ఎంవీ సామర్థ్య సబ్ స్టేషన్ త్వరలో నిర్మాణం ప్రారంభంఅవుతుందన్నారు.కొత్తపేట సబ్ స్టేషన్ అందుబాటులోకి వస్తే తెనాలి పట్టణంలో విద్యుత్ సమస్యలు పూర్తిగా తగ్గనున్నాయని మంత్రి తెలిపారు.విద్యుత్తు శాఖ సిబ్బందిని డే & నైట్ షిఫ్టుల వారీగా అందుబాటులో ఉంచాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో అవుట్సోర్సింగ్ మరియువిశ్రాంత సిబ్బందిని వినియోగించాలని ఆదేశంప్రజల ఫోన్ కాల్స్కు ఓర్పుగా స్పందించి సమస్య పరిష్కార సమయాన్ని స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.చెట్లు, కొమ్మల తొలగింపులో మున్సిపల్ సిబ్బందితో సమన్వయం అవసరమన్నారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరాయ వి
