Breaking News

కొల్లూరు సంఘటన బాధితులను పరామర్శించిన కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్ధన్

మే 24, (నేటి తెలుగు పత్రిక): బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలంలో జరిగిన ఘటనలో బాధితులైన కాపు సామాజికవర్గ కుటుంబాలను కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్ధన్ పరామర్శించారు. భట్టిప్రోలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన బాధితులు ఉప్పు జానకిరామయ్య, రాము బాలు, రాము నారాయణ, రాము వెంకటలక్ష్మిని కలిసి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకున్న చందు జనార్ధన్.. వారికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఘటనకు సంబంధించిన వివరాలను వేమూరు సీఐతో పాటు కొల్లూరు, భట్టిప్రోలు ఎస్‌ఐలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చందు జనార్ధన్ స్పష్టం చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో బశెట్టి ప్రసాద్, ఓతుకోలు మార్కండేయులు, అరవ హరిబాబు, బొందలపాటి చలమయ్య, బి వెంకటరామయ్య, తాడిశెట్టి బాలాజీ, మత్తి నాగరాజు, సనకా శివయ్య, ఉప్పు భాస్కర్, రవితేజ, కంకణాల రవి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో 1,050 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

భానుడి భగభగ.. వడదెబ్బతో ఒక్కరోజే 56 మంది మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *