Breaking News

హైకోర్టు న్యాయవాది హత్య కేసులో సంచలన అంశాలు

మే 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూ.10 లక్షల సుపారీతో ఐదుగురు సభ్యుల ముఠా ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కిషన్‌ అనే వ్యక్తి ద్వారా వినయ్‌ గ్యాంగ్‌తో ఒప్పందం కుదిరినట్లు దర్యాప్తులో తేలింది.ప్రధాన నిందితుడు వినయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో నలుగురు నిందితులు గోవా, కల్వకుర్తి ప్రాంతాలకు పారిపోయినట్లు సమాచారం. అయితే వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.హత్యకు ఉపయోగించిన సెకండ్‌హ్యాండ్ కారును ఆరు నెలల ముందే కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కదలికలపై నిందితులు పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు తేలింది. ఇంటి వద్ద కారుతో ఢీకొట్టి సుమారు 20 మీటర్ల వరకు లాక్కెళ్లిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి.వక్ఫ్ భూముల వివాదమే హత్యకు ప్రధాన కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. “మా నాన్నకు ముందే బెదిరింపులు వచ్చాయి” అని మృతుడి కుమారుడు ఫర్హాన్ ఆరోపించారు.ఈ కేసులో ముజాహిద్ ఆలంఖాన్, మహబూబ్ ఆలంఖాన్‌ల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

రేవంత్–మహేశ్ మధ్య దూరం పెరుగుతోందా..? కాంగ్రెస్‌లో కోల్డ్ వార్ చర్చ

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ.. పలుచోట్ల 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *