Breaking News

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు

మే 25, (నేటి తెలుగు పత్రిక): కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన రామ్మోహన్ నాయుడు, ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. తాగునీరు సమృద్ధిగా తీసుకోవడంతో పాటు జాగ్రత్తలు పాటించాలని కోరారు.తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, టీటీడీ అధికారులు సమర్థవంతంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారని ఆయన ప్రశంసించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం, టీటీడీ కలిసి పని చేస్తున్నాయని కేంద్రమంత్రి తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *