Breaking News

రైతుల కోసం నష్టానికైనా మొక్కజొన్న కొనుగోలు: సీఎం రేవంత్ రెడ్డి

మే 25, (నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ ప్రతినిధి బృందం రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కార్మికులకు కనీస వేతనాల పెంపు నిర్ణయంపై సీపీఐ నాయకులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతుల సమస్యలపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడి భారీగా వచ్చిందని, కేంద్రం కొనుగోలు చేయకపోయినా రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి కొనుగోలు చేస్తోందన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక భారం వచ్చినా రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ ఎమ్మెల్సీ సత్యం, పశ్య పద్మ, ఈ. నరసింహ, చాడ వెంకట్ రెడ్డి, బాగం హేమంతరావు, శంకర్, బాల నరసింహ, వీఎస్ బోసు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ మెట్రోకు భారీ ఊరట.. రూ.13,600 కోట్ల రుణ ఒప్పందం

గోదావరి జలాలతో ఖమ్మం సస్యశ్యామలం: మంత్రి తుమ్మల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *