మే 25, (నేటి తెలుగు పత్రిక): ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు అందించడం తన చిరకాల లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తోందన్నారు. యాతాలకుంట టన్నెల్ పనులను పరిశీలించిన మంత్రి, ఖమ్మం జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. రాజీవ్ లింక్ కెనాల్, సీతారామ ప్రాజెక్టుల ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యమన్నారు. ఆగస్టు 15లోగా టన్నెల్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
