మే 25, (నేటి తెలుగు పత్రిక): నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్రెడ్డి సుడిగాలి పర్యటన నిర్వహించారు. మైనార్టీల కోసం నిర్మిస్తున్న నూతన షాదీఖానా పనులను పరిశీలించిన మంత్రి.. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.అలాగే అవుకుమెట్ట ప్రాంతంలో జరుగుతున్న రహదారి విస్తరణ పనులను తనిఖీ చేసి, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బనగానపల్లె పట్టణంలోని పాత ఎమ్మార్వో కార్యాలయం పునరుద్ధరణ పనులనూ పరిశీలించి పలు సూచనలు చేశారు.
