మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు, కొడంగల్ నియోజకవర్గ దౌల్తాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జ్ శ్రీరాంరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇవాళ విచారిస్తోంది.గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు తిరుపతిరెడ్డికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం సేకరించేందుకు శ్రీరాంరెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఆయన ఫోన్ను ఎప్పుడు ట్యాప్ చేశారు? ఎవరితో మాట్లాడిన సమయంలో నిఘా పెట్టారు? అనే అంశాలపై సిట్ స్టేట్మెంట్ నమోదు చేస్తోంది.ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు, కీలక వ్యక్తుల పాత్రపై విచారణ కొనసాగుతుండగా.. తాజా పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
