అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. డీఎస్సీని కేవలం ప్రచార సాధనంగా ఉపయోగించుకుని ఉద్యోగార్థులను మోసం చేశారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.సోషల్ మీడియా వేదికగా స్పందించిన జగన్.. ప్రశ్నల పత్రాల లీకేజీ, డేటా డిలీట్, మెరిట్ లిస్టుల మాయంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.అలాగే కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాలను ఎందుకు ప్రదర్శించలేదని ప్రశ్నించారు. మొత్తం నియామక ప్రక్రియపై పారదర్శకత లేకుండా వ్యవహరించారని విమర్శించారు.ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ను పదవి నుంచి తప్పించాలని జగన్ డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలపై వెంటనే సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.
