మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు అందజేయనున్న ‘ఇందిరమ్మ చీరల’ డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మంత్రిణి సీతక్క, మహిళా ఉన్నతాధికారుల సమక్షంలో చిలకపచ్చ రంగులో రూపొందించిన రెండు కొత్త డిజైన్ల చీరలను విడుదల చేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్.. మంత్రి సీతక్కతో పాటు ఓ మహిళా అధికారికి చీరలను బహూకరించారు. ఈసారి గ్రామీణ ప్రాంతాలకే కాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం నేతన్నల నుంచి కోటి చీరలకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం.
