మే 25, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు సవాల్ విసిరారు. ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగదని, అదే విధంగా డబుల్ బెడ్రూం ఇళ్లు అందని గ్రామాల్లో బీఆర్ఎస్ కూడా ఓట్లు అడగకూడదని వ్యాఖ్యానించారు.జూన్ 1 నుంచి మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుడతామని మంత్రి ప్రకటించారు. హైదరాబాద్లోని మూడు కార్పొరేషన్ల పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు.ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్పై పొంగులేటి తీవ్ర విమర్శలు చేశారు. “చెల్లి, బావ ఫోన్లు ట్యాప్ చేసిన కేటీఆర్కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత లేదు” అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల కల నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
