మే 25, (నేటి తెలుగు పత్రిక): ఎక్కువ మంది పిల్లలను కనాలన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నలు సంధించారు. మూడు, నాలుగో బిడ్డ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందా? అని నిలదీశారు. పిల్లలకు సరైన వైద్య సదుపాయాలు రాష్ట్రంలో ఎక్కడున్నాయని ప్రశ్నించారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్లోనే చికిత్స చేయించుకున్నారని గుర్తుచేస్తూ, సాధారణ ప్రజల పిల్లల పరిస్థితి ఏమిటని ధ్వజమెత్తారు. “ఎక్కువ మంది పిల్లలు కనాలి” అనే నినాదం అభివృద్ధి చెందిన దేశాల్లోనే విఫలమైందని పేర్కొన్నారు.ప్రజలకు నాణ్యమైన వైద్యం, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైందికాదని పేర్ని నాని విమర్శించారు.
