Breaking News

లక్షద్వీప్‌కు చేరిన నైరుతి రుతుపవనాలు

మే 28, (నేటి తెలుగు పత్రిక): భారత వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌ ప్రాంతాలతో పాటు బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్లు తెలిపింది.వాతావరణ శాఖ ముందస్తు అంచనాల ప్రకారం ఈ నెల 26 నాటికే Kerala తీరానికి రుతుపవనాలు చేరాల్సి ఉండగా, స్వల్ప ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం. సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకే నైరుతి రుతుపవనాలు, అనంతరం వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయి.ఈసారి కూడా రుతుపవనాల పురోగతిని వాతావరణ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. రైతులు, ప్రజలు తాజా వాతావరణ హెచ్చరికలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఎన్టీఆర్ ఆశయాల సాకారానికి కట్టుబడి ఉన్నాం: మోదీ

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన ఇషా సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *