Breaking News

ఎన్టీఆర్ ఆశయాల సాకారానికి కట్టుబడి ఉన్నాం: మోదీ

మే 28, (నేటి తెలుగు పత్రిక): నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన కోసం ఎన్టీఆర్ చేసిన సేవలను ఆయన ప్రశంసించారు. సినీరంగంలో ఎన్టీఆర్ నటన చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన పోషించిన పాత్రలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాల సాకారానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని సామాజిక మాధ్యమ వేదికగా తెలిపారు. మరోవైపు ప్రముఖ నటుడు చిరంజీవి కూడా ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు. “ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో చెరిగిపోదు” అంటూ భావోద్వేగ నివాళులు అర్పించారు.

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి వివేక్

రాయలసీమ జీవనాడి హంద్రీనీవాను పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదే: నిమ్మల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *