Breaking News

సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: అమిత్ షా

మే 28, (నేటి తెలుగు పత్రిక): దేశ సరిహద్దులకు ఆనుకుని ఉన్న 15 కిలోమీటర్ల పరిధిలోని అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.బికనీర్‌లో నిర్వహించిన భద్రతా సమీక్ష సమావేశంలో అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలు, పెద్ద సంస్థల నిధుల మూలాలు, నకిలీ సంస్థలు, ఫేక్ ఆధార్ కార్డులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు.దేశ భద్రతకు ముప్పుగా మారే అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని కేంద్రం స్పష్టం చేసింది.

ఎన్టీఆర్ ఆశయాల సాకారానికి కట్టుబడి ఉన్నాం: మోదీ

నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *