Breaking News

ఎన్టీఆర్‌ది మరణం లేని జననం: పురంధేశ్వరి

హైదరాబాద్, మే 28, (నేటి తెలుగు పత్రిక): దివంగత ముఖ్యమంత్రి, నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఘన నివాళులు అర్పించారు. తన తండ్రి సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి తెలిపారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పురంధేశ్వరి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ది “మరణం లేని జననం” అని పేర్కొన్నారు. భౌతికంగా మనల్ని విడిచి దాదాపు మూడు దశాబ్దాలు అవుతున్నా, ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలు, ప్రజాసేవా భావనను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అవుతుందని పురంధేశ్వరి తెలిపారు.

కాజీపేటలో త్వరలో ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ: అశ్వినీ వైష్ణవ్

పొంగులేటిపై కేటీఆర్ సవాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *