Breaking News

మహానాడు పూర్తిగా విఫలమైంది: మాజీ మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్, మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.మహానాడులో రాజకీయ చర్చలకంటే వినోద కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. కార్యకర్తలు కూడా చంద్రబాబు ప్రసంగాలను పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.వైసీపీ అధినేత జగన్ స్థాయికి సరిపోని నాయకులు కూడా అనవసరంగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నిస్తే “గొడ్డలి పార్టీ” అంటూ విమర్శించడం సరికాదన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రజలను మోసం చేస్తే సహించబోమని రోజా హెచ్చరించారు.

రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కీలకం: పెమ్మసాని చంద్రశేఖర్

శబ్ద కాలుష్యంపై ప్రజలకు రఘురామ కీలక సూచన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *