మే 29, (నేటి తెలుగు పత్రిక): సినిమా టికెట్ ధరల పెంపుపై సీపీఐ నేత నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులు సమావేశమై టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు ఆదాయంపై చర్చించడం ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానించారు.భారీ బడ్జెట్ సినిమాల పేరుతో ప్రత్యేక ప్రదర్శనలు, అదనపు షోల ద్వారా సామాన్య ప్రేక్షకులపై భారం మోపడం సరైంది కాదని అన్నారు. సినిమా చూడటం సాధారణ ప్రజలకు భారంగా మారకూడదని సూచించారు.టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నారాయణ కోరారు. ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.
