మే 29, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడిచినా టీడీపీకి తెలంగాణపై ఈర్ష్య ఇంకా తగ్గలేదని బీఆర్ఎస్ నేత జీవన్రెడ్డి విమర్శించారు. మహానాడులో టీడీపీ నేత బక్కాని నర్సింహులు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణకు చెందిన వ్యక్తి అయి ఉండి, డిక్షనరీలో ‘తెలంగాణ’ అనే పదమే లేదని వ్యాఖ్యానించడం టీడీపీ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం బాధాకరమని అన్నారు.బక్కాని నర్సింహులు చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు వెంటనే ఖండించాలని జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఆ వ్యాఖ్యలను చంద్రబాబు అభిప్రాయంగానే ప్రజలు భావించాల్సి వస్తుందని హెచ్చరించారు.
