Breaking News

మేడారం తరహాలో భద్రాచలం ఆలయ అభివృద్ధి: మంత్రి సీతక్క

మే 29, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ, మేడారం సమ్మక్క-సారక్క జాతర తరహాలోనే భద్రాచలం ఆలయాన్ని కూడా భారీ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.భద్రాచలం దేవాలయ అభివృద్ధి కోసం రూ.351 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ అభివృద్ధి పనులకు సహకరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని సీతక్క పేర్కొన్నారు.

హైడ్రాలో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు.. సమానత్వ దిశగా తెలంగాణ ప్రభుత్వ కీలక అడుగు

సమాచార హక్కు కమిషన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *