Breaking News

వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు!

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజ్యసభ సభ్యత్వం లభించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆమె పేరును ఖరారు చేసినట్లు సమాచారం.మల్లికార్జున్ ఖర్గే ప్రకటించిన జాబితా ప్రకారం కర్ణాటక నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి షర్మిలను పార్టీ అభ్యర్థిగా నిలబెట్టినట్లు వెల్లడైంది. కర్ణాటకలో కాంగ్రెస్‌కు శాసనసభలో బలమైన సంఖ్యాబలం ఉండటంతో ఆమె ఎన్నిక సులభమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యసభకు ఎంపికైతే జాతీయ రాజకీయాల్లో షర్మిలకు మరింత ప్రాధాన్యం పెరగనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశాలను పార్లమెంట్‌లో బలంగా వినిపించే అవకాశం కూడా లభించనుంది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *