జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): గత ప్రభుత్వ హయాంలో తమ ఫోన్లు అక్రమంగా ట్యాప్ అయ్యాయని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి బంజారాహిల్స్లోని ఐసీసీసీ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు.
160 సీఆర్పీసీ కింద జారీ చేసిన నోటీసుల మేరకు వారు అధికారుల ఎదుట హాజరయ్యారు. ఎన్నికల సమయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ దర్యాప్తులో ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు లభించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో సిట్ అధికారులు తమ వద్ద ఉన్న సాంకేతిక, ఇతర ఆధారాలను ఎమ్మెల్యేల ముందుంచి వివరాలు సేకరిస్తున్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అంశాలపై వారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు.ఈ కేసులో ఇప్పటికే పలువురు మాజీ అధికారులు, సంబంధిత వ్యక్తులను సిట్ విచారించగా, తాజా విచారణతో దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
