జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): దక్షిణ కోస్తా రైల్వే మండలి ఏర్పాటుతో పారిశ్రామిక పురోగతి, ఉపాధి అవకాశాల విస్తరణకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ రైల్వే మండలి ఏర్పాటుతో విశాఖపట్నం ప్రాధాన్యం జాతీయ స్థాయిలో మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.సరుకు రవాణా, ప్రయాణికుల సేవలు, రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి విస్తృత అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రైల్వే పరిపాలన వికేంద్రీకరణతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.ఈ రైల్వే మండలి ప్రాంతీయ అభివృద్ధికి కీలక కేంద్రంగా మారి, ఉత్తరాంధ్ర ఆర్థిక ప్రగతిని మరింత వేగవంతం చేస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
