Breaking News

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై మళ్లీ ఆంక్షలు

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నేటి నుంచి మళ్లీ నిషేధం అమల్లోకి వచ్చింది. మే నెలలో ప్రభుత్వం కల్పించిన బదిలీల అవకాశం గడువు ముగియడంతో తాజా ఆదేశాలు జారీ చేసింది.అయితే పదోన్నతులు పొందిన ఉద్యోగులు, దీర్ఘకాలిక సెలవుల అనంతరం విధుల్లో చేరేవారు, అత్యవసర ఖాళీల భర్తీ వంటి ప్రత్యేక పరిస్థితులకు మినహాయింపు కల్పించారు. వీటి విషయంలో సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు చేపట్టవచ్చని స్పష్టం చేశారు. జూన్ 1 నుంచి వచ్చే ఆరు నెలల పాటు బదిలీలకు సంబంధించిన ఎలాంటి మినహాయింపు ప్రతిపాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవద్దని ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సాధారణ బదిలీల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *