Breaking News

జాతీయ బీసీ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు..!

విజయవాడ. జూన్ 1 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్నా బీసీలు ఇంకా రాజకీ య అధికారానికి దూరం గానే ఉన్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాకా వెంగళరావు ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని విమర్శిం చారు. ఏపీలోని 140 బీసీ కులాల్లో సుమారు 100కు పైగా కులాలు ఇప్పటికీ చట్టసభల్లో అడుగుపెట్టలేదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో గాంధీనగ ర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. సంఘం విజయవాడ సిటీ అధ్యక్షులు సేరం నాగమ ల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షు లు లాక వెంగళరావు యాదవ్, రాష్ట్ర అధ్యక్షు లు ఆవుల నరసింహారా వు, రాష్ట్ర కార్యదర్శి జొన్నలగడ్డ పవన్ కుమార్, ఉపాధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు చల్లా అనుదీ ప్, రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు షేక్ నాగు ల్ మీరా ప్రధాన కార్యద ర్శి పుట్ట అమరలింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెం టు, అసెంబ్లీల్లో బీసీలకు తక్షణమే రిజర్వే షన్లు కల్పించాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాల ని, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లోనూ బీసీలకు అవకాశం కల్పిం చాలన్నారు. స్థానిక సం స్థల ఎన్నికల్లో బీసీ రిజ ర్వేషన్లను ప్రస్తుతమున్న శాతం నుంచి 42 శాతాని కి పెంచాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ‘బీసీ రక్షణ చట్టాన్ని’ తక్షణమే అమలు చేయాలన్నారు. బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి, అలంకారప్రాయంగా మారిన బీసీ కార్పొరేషన్ల కు తగినన్ని నిధులు కేటా యించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బడికిచెర్ల చంద్రమోహ న్, బి.ఎస్. ఆర్ యాదవ్, మహిళా ప్రతినిధులు స్వాతి, నాగమణి తదిత రులు పాల్గొన్నారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *