Breaking News

విశాఖలో ఎయిర్ ట్రంక్ డేటా సెంటర్ క్యాంపస్‌కు లోకేష్ ఆహ్వానం

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఎయిర్ ట్రంక్ సంస్థ సీఈవో రాబిన్ ఖుదాను ఆయన ఆహ్వానించారు.

ముంబయిలో జరిగిన సమావేశంలో విశాఖపట్నం డేటా సెంటర్ల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన నగరమని లోకేష్ వివరించారు. ఇప్పటికే గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, అదానీ కనెక్స్ వంటి కీలక ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

విశాఖలో 6 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మల్టీ-గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన కనెక్టివిటీ, విద్యుత్ వనరులు, పారిశ్రామిక మద్దతు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని వివరించారు.

డేటా సెంటర్ల అవసరాలకు అనుగుణంగా పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని లోకేష్ తెలిపారు. భారత్‌లో విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నాన్ని ప్రాధాన్యంగా పరిశీలించాలని ఎయిర్ ట్రంక్ సంస్థను కోరారు.

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

గతంలో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ప్రారంభమైన చర్చల అనంతరం ఎయిర్ ట్రంక్ ప్రతినిధులు పలుమార్లు ఏపీ అధికారులతో సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం ముంబయి, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ, భవిష్యత్ విస్తరణలో విశాఖను కూడా పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *