జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుత పాలనలో రాష్ట్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించడం లేదని, ఆర్థిక సమస్యలు మరింత పెరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కేంద్రం సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్న ఆయన, కేంద్ర నిధులను సమర్థంగా వినియోగించడం వల్ల అక్కడ పురోగతి కనిపిస్తోందన్నారు.
తెలంగాణలో మాత్రం గత ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుతం కూడా అవినీతి ఆరోపణలు కొనసాగుతున్నాయని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పారదర్శక పాలన అవసరమని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగితేనే తెలంగాణ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
