జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడాలి: చంద్రబాబు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు జాతి ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభివృద్ధిలో ఆరోగ్యకరమైన పోటీతో ముందుకు సాగాలని, దేశ అభివృద్ధి లక్ష్యాల సాధనలో రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన తెలుగు నేల మరిన్ని విజయాలు సాధించాలని అన్నారు.
అమరావతి, హైదరాబాద్ నగరాలు ప్రపంచ స్థాయి నగరాలుగా ఎదిగి దేశానికి ఆదర్శంగా నిలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాలని తన సందేశంలో పేర్కొన్నారు.
