AP: రాష్ట్రంలో నేటి నుంచి రెవెన్యూ గ్రామ సదస్సులు ప్రారంభం అవుతున్నాయి. ఈ సదస్సులు డిసెంబర్ 8వ తేదీ వరకు 17,564 గ్రామాల్లో నిర్వహించబడతాయి. భూముల రికార్డులను అప్డేట్ చేయడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు వారి భూసమస్యలను స్థానికంగా పరిష్కరించే విధంగా అధికారులు గ్రామాలకు వెళ్లి, అసైన్డ్ భూములు, డొంక, వాగు పోరంబోకు, ఇనాం, దేవదాయ, వక్స్, 22ఏ, ఫ్రీ హోల్డ్ భూములపై సమాచారం సేకరించనున్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో ఈ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది.
