Breaking News

Modernization of Annaprasada kitchens in Tirumas..!!

తిరుమలలో అన్నప్రసాద వంటశాలల ఆధునికీకరణ..!!

తిరుమలలో అన్నప్రసాద వంటశాలల ఆధునికీకరణ..!!

టీవీఎస్‌ మోటార్స్‌ సహకారంతో ముందుకుపైలట్‌ ప్రాజెక్టు కింద ఎంటీవీఏసీని చేపట్టేందుకు సన్నద్ధం

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

తిరుపతి: తిరుమలలోని వంటశాలల ఆధునికీకరణతో పాటు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించేందుకు కొత్త పరికరాల ఏర్పాటుకు తితిదే సిద్ధమవుతోంది.

ఇందులో భాగంగా పరికరాల యాంత్రీకరణ (మెకనైజేషన్‌)తో పాటు వంటశాలలను పూర్తిగా మార్చేందుకు టీవీఎస్‌ మోటార్స్‌ (టీవీఎస్‌ఎం)తో ఒప్పందం చేసుకోనుంది. తొలివిడత పైలట్‌ ప్రాజెక్టు కింద మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నదాన సత్రం (ఎంటీవీఏసీ)లో పనులు చేపట్టనున్నారు. వైకాపా హయాంలో అన్నప్రసాదాలపై భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. కూటమి అధికారంలోకి రాగానే దీనిపై ప్రత్యేకదృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన సందర్భంగా వంటశాలను ఆటోమేట్‌ చేసే ప్రక్రియను చేపట్టాలని అధికారులకు సూచించారు. 30 నిమిషాల్లోనే అన్నప్రసాదాలు అందించే దిశగా పరికరాలు, వంట చేసే ప్రక్రియ, ఆహార పంపిణీ వంటి వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా టీవీఎస్‌ ప్రతినిధులు అక్టోబరు 24, 25 తేదీల్లో తిరుమలలోని ఎంటీవీఏసీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయణగిరి షెడ్స్, బాహ్యవలయ రహదారిలోని క్యూలైన్లు, కొత్తగా నిర్మించిన వకుళమాత కేంద్రీకృత వంటశాల, పద్మావతి అతిథిగృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంటీవీఏసీ ప్రత్యేక అధికారి అక్కడ ఉన్న పరికరాలు, అన్నప్రసాదం తయారీ విధానాన్ని టీవీఎస్‌ ప్రతినిధులకు వివరించారు.

తితిదేకు సహకారం: అధికారులతో చర్చించిన తర్వాత అక్కడ ఎంటీవీఏసీలో పైలట్‌ ప్రాతిపదికన ఆధునికీకరణ, మెకనైజేషన్‌ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. తితిదేతో ఎంవోయూ చేసుకునేందుకు టీవీఎస్‌ఎం ముందుకొచ్చింది. తిరుమల శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాన్ని అందించేందుకు 2011లో ఎంటీవీఏసీని నిర్మించారు. అన్నప్రసాద వంటశాలను పూర్తిగా ఆధునికీకరించేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదలను, డిజైన్లను టీవీఎస్‌ఎం అందించనుంది. పరికరాలను సరఫరా చేసే గుత్తేదారులను గుర్తించి తితిదేకు సమాచారం ఇవ్వనుంది. వంటశాలను పూర్తిగా మార్చే నైపుణ్యం ఉన్న కన్సల్టెంట్లను టీవీఎస్‌ఎం చూడనుంది. వీరికి నిధులను ఆ సంస్థే భరిస్తుంది. ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో టీవీఎస్‌ఎంతో ఒప్పందం చేసుకునేందుకు తితిదే సిద్ధమైంది.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

నాణ్యమైన అన్నప్రసాదం

అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల భక్తులకు సకాలంలో నాణ్యమైన అన్నప్రసాదాన్ని అందించేందుకు ఆస్కారం ఉంది. ఇప్పటికే అన్నదానంలో నాణ్యతను పెంచేందుకు తితిదే అధికారులు తెలుగు రాష్ట్రాల రైస్‌మిల్లర్ల సంఘం నుంచి నేరుగా బియ్యం సేకరిస్తోంది. గతంలో విరిగిన, దెబ్బతిన్న, రంగుమారిన, సుద్ద ఉన్న బియ్యం 47.5% ఉన్నా అంగీకరించేవారు. ఇప్పుడు 26.5 శాతానికి తగ్గించారు. దీనివల్ల నాణ్యమైన బియ్యం రావడానికి ఆస్కారం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *