ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్!
ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి స్థాయి గ్రాట్యుటీని చెల్లించే విషయంపై ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు, గ్రాట్యుటీపై రూ.16 లక్షల సీలింగ్ను తొలగించారు.
ఇప్పటికే తక్కువ మొత్తం గ్రాట్యుటీ పొందిన రిటైర్డ్ ఉద్యోగులకూ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపింది.
బకాయిల కోసం వారు త్వరగా డిపోల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఆర్థిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆర్టీసీ సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
