ఈ నెల 17న మంగళగిరి ఎయిమ్స్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
డిసెంబర్ 08, 2024
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న పర్యటించనున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు.
ఈ సందర్భంగా ఎయిమ్స్ అధికారులు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పటిష్ఠంగా కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్ బస:
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 16 నుంచి 21 వరకు హైదరాబాద్లోని బొల్లారం రాష్ట్రపతి భవన్లో బస చేయనున్నారు.
ఈ పర్యటనకు సంబంధించి ఎయిమ్స్ అధికారులు, జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు.
