Breaking News

Incompetent CM Revanth who can't even expand the cabinet

మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేని అసమర్థ సీఎం రేవంత్

|| Incompetent CM Revanth who can’t even expand the cabinet || – కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి ప్రజల్లో మద్దతు లేకపోవడం వల్లే అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరుతున్నారని వ్యాఖ్యానించారు.

రైల్ రోకో కేసులో కల్వకుంట్ల కవితకు సికింద్రాబాద్ రైల్వే కోర్టు సమన్లు

“15 నెలల్లోనే ప్రజలకు విసుగు”

  • తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్‌కు చెందిన మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు.
  • ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కూడా కాకముందే నేతలు పార్టీని వదిలిపెడుతుండటమే పాలన ఎలా ఉందో అర్థం చేసేందుకు నిదర్శనం” అని అన్నారు.
  • “రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌లో చేరుతున్నారు. ఇది ప్రజలు కాంగ్రెస్ పాలనపై ఎంత అసంతృప్తిగా ఉన్నారో చూపిస్తున్న ఉదాహరణ” అని వ్యాఖ్యానించారు.

“రైతు ఆత్మహత్యలు, ఎస్ఎల్బీసీ ప్రమాదం – సీఎం మాత్రం ప్రచారంలో”

  • గత 48 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయినా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని మండిపడ్డారు.
  • “ఈ ఎన్నికలతో ప్రభుత్వం మారదుగానీ, రేవంత్ మాత్రం హెలికాప్టర్ ఎక్కి ప్రచారం చేస్తున్నాడు” అని ఎద్దేవా చేశారు.

“మంత్రివర్గ విస్తరణ చేయలేని సీఎం”

  • “రాష్ట్రానికి హోం మంత్రి, విద్యా మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి లేరు” అని గుర్తుచేశారు.
  • “మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేని సీఎం, కేసీఆర్ను ఎలా మాయం చేస్తానంటాడు?” అని ప్రశ్నించారు.
  • “రోజూ తెల్లారితే కేసీఆర్ పేరు, నిద్రలో కూడా ఆయన పేరే తలచుకుంటున్నట్టు ఉంది” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

“రేవంత్ గెలుపు లక్కీలాట.. ఇప్పుడు ఢిల్లీకి పరుగులు”

  • “అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తన సన్నిహితులతో ‘మనం గెలవలేం.. ప్రతిపక్షంలో ఉండి గట్టిగా పోరాడాలి.. కేసీఆర్ ఉన్నంతకాలం గెలుపు సాధ్యం కాదు’ అని అన్నట్లు సమాచారం” అని కేటీఆర్ వెల్లడించారు.
  • “అయితే, ప్రజలు లక్కీ లాటలో గెలిపించారని, ఇప్పుడు ఆ గెలుపును నిలబెట్టుకోలేక ఢిల్లీకి 36 సార్లు పరుగులు తీస్తున్నాడు” అని విమర్శించారు.
  • “ఎన్నిసార్లు వెళ్లినా, ఏం పీకినా రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనం ఉండదని” కేటీఆర్ స్పష్టం చేశారు.

పని మనుషుల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి: హైదరాబాద్ పోలీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *