Breaking News

TPCC Chief's strong counter to Union Minister's comments!

కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ స్ట్రాంగ్ కౌంటర్!

కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్!

హైదరాబాద్: బీజేపీ భారత జట్టు అని, రాష్ట్రంలో ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ క్రికెట్ టీమ్ లాంటిదని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు.

“బండి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు.. ఓట్ల కోసమే ఈ డ్రామా”

  • ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయనే బండి సంజయ్ మరోసారి రాజకీయంగా ప్రొవోక్ చేసే మాటలు మాట్లాడుతున్నారని మహేష్ గౌడ్ విమర్శించారు.
  • రాష్ట్ర రాజకీయాలను క్రికెట్‌తో పోల్చడం బీజేపీ నాయకుల అసహనాన్ని చాటుతున్నదని వ్యాఖ్యానించారు.
  • “ఇండియా గెలిస్తే బీజేపీ గెలిచినట్టే” అన్నట్టుగా బండి సంజయ్ మాట్లాడటం దురదృష్టకరం అని మండిపడ్డారు.

“మత విద్వేషాలు రెచ్చగొట్టే బండి సంజయ్.. తెలంగాణ ప్రయోజనాల గురించి ఎందుకు మాట్లాడరు?”

  • ఎమ్మెల్సీ ఎన్నికల సమీపంలో ఉండటంతోనే బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
  • ఎప్పటిలాగే ఎన్నికల సమయంలోనే బీజేపీకి హిందుత్వ నినాదం గుర్తుకువస్తుందని ఎద్దేవా చేశారు.
  • “తెలంగాణ ప్రజల పన్నుల నుంచి కేంద్రం కట్టాల్సిన వాటిపై బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు ఏనాడైనా గొంతెత్తారా?” అని ప్రశ్నించారు.

బండి సంజయ్ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ వర్గాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *