మంగళగిరిలో ఇంటింటికీ వంట గ్యాస్ అందించేందుకు మంత్రి నారా లోకేశ్ నగరపాలక సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (MTM)లో పైపులైన్ ద్వారా వంట గ్యాస్ పంపిణీకి అనుమతి ఇవ్వాలని చెప్పారు.
అనుమతి అందుకోవడంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ నెల రెండో వారంలో వినియోగదారుల పేర్లు నమోదు చేయబడతాయని అధికారులు తెలిపారు.
గ్యాస్ కనెక్షన్ కోరుతున్న వినియోగదారుల ఇళ్లకే పైపులైన్ వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
