గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల
రాష్ట్రంలో ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1368 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాజాగా, గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను TGPSC విడుదల చేసింది. మొత్తం 4 పేపర్లతో ఈ పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 ఉద్యోగాలకు సుమారు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
