Breaking News

“అసెంబ్లీని ఇష్టానుసారంగా నడుపుతున్నారు”.. తలసాని ఘాటు విమర్శలు

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో అసెంబ్లీ నిర్వహణపై బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీని ఇష్టానుసారంగా నడిపిస్తున్నారని ఆరోపిస్తూ, ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.అక్రమ మైనింగ్ అంశాన్ని సభ దృష్టికి తీసుకువచ్చినప్పటికీ, అది తమ దృష్టికి రాలేదని మంత్రి చెప్పడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇక కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి వివాదంపై ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, కానీ గత రెండేళ్లుగా అసెంబ్లీలో ఎలాంటి కమిటీలు పనిచేయడం లేదని గుర్తుచేశారు.ప్రజా సమస్యలను పక్కనబెట్టి సభను నడిపిస్తున్నారని ఆరోపించిన తలసాని, అసెంబ్లీ నిర్వహణలో పారదర్శకత ఉండాలని సూచించారు. అక్రమ మైనింగ్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అండర్‌గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్ “ప్రాణా–2026” విజయవంతం

పార్టీ కార్యాలయాలు పోరాట కేంద్రాలుగా మారాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *