Breaking News

చెరువుల సంరక్షణకు హైటెక్ ఎక్స్‌కవేటర్.. మంత్రి పొన్నం ప్రారంభం

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని పీవీ మార్గ్ వద్ద సంజీవయ్య పార్క్ సమీపంలో చెరువుల సంరక్షణకు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నూతనంగా తీసుకొచ్చిన అధునాతన ఎక్స్‌కవేటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.ఈ యంత్రంతో చెరువులలో పూడికతీత, డ్రెడ్జింగ్, కట్టల బలోపేతం, నీటి కలుపు మొక్కల తొలగింపు, బురద, వ్యర్థాల శుద్ధి వంటి పనులను వేగంగా నిర్వహించవచ్చని అధికారులు తెలిపారు. పాత చెరువుల పునరుద్ధరణలో కూడా ఇది కీలక పాత్ర పోషించనుంది.ప్రత్యేకంగా కూకట్‌పల్లి నాలా మరియు నగరంలోని ఇతర సరస్సుల్లో నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ యంత్రాన్ని వినియోగించనున్నట్లు వెల్లడించారు.అలాగే గణేశ నిమజ్జనం, దుర్గ నిమజ్జనం, బతుకమ్మ, ఛత్ పూజ వంటి పండుగల సమయంలో నిమజ్జనాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేందుకు ఈ యంత్రం ఉపయోగపడనుంది.ప్రతి షిఫ్ట్‌కు నైపుణ్యం గల ఆపరేటర్లు, సర్వీస్ ఇంజనీర్‌తో ఈ యంత్రాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *