40 గ్రాముల కొకైన్ స్వాధీనం
కేంద్ర ఉద్యోగి డ్రగ్స్ దందా వెలుగులోకి
బెంగళూరు, గోవా నుంచి హైదరాబాద్కు రవాణా
మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ సమీపంలోని మోకిలాలో డ్రగ్స్ రాకెట్ను ఫ్యూచర్ సిటీ పోలీసులు ఛేదించారు. గుప్త సమాచారంతో దాడి చేపట్టి డ్రగ్స్ విక్రయిస్తుండగా నిందితులను పట్టుకుని 40 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల దర్యాప్తులో రైల్వే శాఖలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న వ్యక్తి ఈ డ్రగ్స్ దందాకు ప్రధాన సూత్రధారిగా బయటపడినట్లు తెలిపారు. అతను బెంగళూరు, గోవా ప్రాంతాల నుంచి డ్రగ్స్ను హైదరాబాద్కు స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.ఈ కేసులో Googleలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పాటు మరో వ్యాపారవేత్తను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.డ్రగ్స్ సరఫరా నెట్వర్క్పై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
