Breaking News

తెలంగాణలో రేషన్ కార్డుదారులకు షుభవార్త

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తోంది. వచ్చే నెలలో కొత్త రేషన్ షాపులు ప్రారంభించి, ఒకేసారి మూడు నెలల రేషన్‌ను పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.ఈ చర్య ద్వారా ఏప్రిల్, మే, జూన్ నెలల రేషన్ కోటాను ఒకేసారి అందిస్తూ, ఎండల తీవ్రతలో రేషన్ సరఫరాను వేగవంతం చేయడం లక్ష్యం.

హేట్ స్పీచ్ బిల్లు’పై కేటీఆర్ ఫైర్.. ప్రజాస్వామ్యానికి ముప్పు అని విమర్శ
  • ప్రతి నెల 6 కిలోల బియ్యాన్ని అందించే విధంగా, మూడు నెలల కోసం ఒక్కో కుటుంబ సభ్యునికి 18 కిలోలు బియ్యం ఇవ్వబడుతుంది.
  • 5 మంది సభ్యులు ఉన్న కుటుంబానికి 90 కిలోలు, అంత్యోదయ కార్డు కలిగిన కుటుంబానికి 105 కిలోలు అందుతాయి.
  • పోర్టబిలిటీ సౌకర్యం వల్ల, లబ్ధిదారులు సమీపంలోని ఏ రేషన్ షాపులోనైనా రేషన్ పొందవచ్చు.
  • ఒకేసారి మూడు నెలల స్టాక్ కోసం బయోమెట్రిక్ మెషిన్ సాఫ్ట్‌వేర్ను అప్డేట్ చేస్తున్నారు.

ప్రభుత్వం డిమాండ్‌ను తీర్చడానికి రేషన్ దుకాణాల్లో సరఫరా ఏర్పాట్లను సన్నద్ధం చేస్తోంది, తద్వారా పౌరుల‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా సరుకులు అందేలా చూసుకుంటోంది.

కేసీఆర్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. గృహనిర్బంధం అనుమానం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *