ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధిపై కీలక చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు (NDDB) చైర్మన్ డాక్టర్ మీనేష్ షా, మదర్ డెయిరీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జయతీర్థ చారి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో పాడి రంగాన్ని మరింత బలోపేతం చేయడం, రైతులకు లాభదాయకమైన విధానాలు అమలు చేయడం, డెయిరీ మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చించారు.ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

