ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: కిడ్నీ రాళ్ల సమస్యకు బీర్ పరిష్కారం అన్న నమ్మకం ప్రజల్లో విస్తృతంగా ఉన్నప్పటికీ, ఇది పూర్తిగా తప్పుదారి పట్టించే అపోహ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. బీర్ తాగడం వల్ల రాళ్లు కరుగవు, బయటకు వెళ్లడంలో కూడా ప్రత్యేక ప్రయోజనం ఉండదని స్పష్టం చేస్తున్నారు.కిడ్నీలో కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి పదార్థాలు పేరుకుపోవడం వల్ల రాళ్లు ఏర్పడతాయి. ఇవి మూత్రనాళంలో అడ్డంకి కలిగిస్తే తీవ్ర నొప్పి, మంట వంటి సమస్యలు వస్తాయి.బీర్ తాగితే మూత్రం ఎక్కువగా రావడం వల్ల రాళ్లు బయటకు వస్తాయని కొందరు భావిస్తారు. అయితే ఇదే ప్రయోజనం సాధారణంగా ఎక్కువ నీళ్లు తాగడం ద్వారా కూడా పొందవచ్చు. పైగా బీర్లోని ఆల్కహాల్ శరీరానికి హానికరం కావడంతో పాటు, యూరిక్ యాసిడ్ పెరగడానికి దారితీస్తుంది. చిన్న రాళ్లు ఎక్కువ నీళ్లు తాగితే సహజంగానే బయటకు వెళ్లే అవకాశం ఉంది. కానీ పెద్ద రాళ్లకు మాత్రం వైద్య చికిత్స అవసరం. స్వయంగా చికిత్సలు చేసుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కాబట్టి కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నవారు బీర్పై ఆధారపడకుండా, తప్పనిసరిగా డాక్టర్ల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.
