ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రానికి స్పష్టమైన రాజధాని లేకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు గుప్పించారు. అమరావతి ప్రాజెక్ట్ సాధ్యం కాదని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2029 నాటికీ రాజధాని పూర్తికావడం అనుమానాస్పదమేనని పేర్కొన్నారు. కనీసం కొన్ని కీలక భవనాలైనా పూర్తవుతాయో లేదో చెప్పలేని పరిస్థితి ఉందని విమర్శించారు.నవ నగరాల పేరుతో ప్రకటించిన ప్రణాళికలు అమలు కాకుండానే నిలిచిపోయాయని, అవి కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
