Breaking News

అమరావతి పై అంబటి సంచలన వ్యాఖ్యలు.. 2029కీ పూర్తి కాదంటూ విమర్శలు

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రానికి స్పష్టమైన రాజధాని లేకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు గుప్పించారు. అమరావతి ప్రాజెక్ట్ సాధ్యం కాదని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2029 నాటికీ రాజధాని పూర్తికావడం అనుమానాస్పదమేనని పేర్కొన్నారు. కనీసం కొన్ని కీలక భవనాలైనా పూర్తవుతాయో లేదో చెప్పలేని పరిస్థితి ఉందని విమర్శించారు.నవ నగరాల పేరుతో ప్రకటించిన ప్రణాళికలు అమలు కాకుండానే నిలిచిపోయాయని, అవి కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

జూన్‌లో తల్లికి వందనం నిధులు.. విద్యార్థుల కుటుంబాలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

చంద్రబాబు ఆగ్రహం: “దేశం అమరావతికి మద్దతు ఇచ్చినా..మన వాళ్లే ఉనికి లేకుండా చేయాలని చూస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *